మల్టీస్టారర్ ఛాన్స్.. మిస్సైందా.. మిస్ చేసుకుందా..!

-

చెన్నై భామ సాయి పల్లవి మళయాల ప్రేమం తర్వాత తెలుగులో ఫిదాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న పడి పడి లేచే మనసు సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి తనకు వచ్చిన మల్టీస్టారర్ ఛాన్స్ వదులుకుందట. నాని, శర్వానంద్ లతో హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్న సినిమా దాగుడుమూతలు.

14 రీల్స్ బ్యానర్ లో నిర్మించబడే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారట. కాని ఆమె సినిమా చేయనని చెప్పిందట. సినిమాలో హీరోయిన్ కు అంత ప్రాముఖ్యత లేదని అనుకున్న సాయి పల్లవి హరీష్ శంకర్ కు సరీ చెప్పేసిందట. అంతేకాదు నాని కూడా దేవదాస్ అంటూ కింగ్ నాగార్జునతో చేసిన సినిమా కూడా హిట్ అవకపోవడంతో మల్టీస్టారర్ చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నాడట. అసలు ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుందో లేదో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news