మరో రెండు స్థానాలకు తెరాస అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్…

-


తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన రోజే తెరాస అధినేత కేసీఆర్ 119 స్థానాలకుగానూ 105 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాలకు విడతలవారీగా అభ్యర్థులను కేటాయిస్తున్న నేపథ్యంలో  జహీరాబాద్ నియోజకవర్గ తెరాస అభ్యర్థిగా మాణిక్ రావు, నగరంలోని మలక్‌పేట్ అభ్యర్థిగా చావ సతీశ్ కుమార్ పోటీ చేయనున్నట్లు ఆదివారం కేసీఆర్ తెలిపారు.  మాణిక్ రావు, సతీశ్ కుమార్‌లకు కేటాయించిన ఆ నియోజకవర్గాల్లో వీరిద్దరూ గతంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ… మరో అవకాశం ఇచ్చారు.  మరో పన్నెండు స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై పరిశీలన చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news