తల్లిదండ్రుల విడాకుల గురించి ఓపెన్ అయిన సాయి తేజ్..!

-

మెగా మేనళ్లుడు సాయి తేజ్ ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. రీసెంట్ గా అతను హీరోగా వచ్చిన చిత్రలహరి సేఫ్ జోన్ లోకి వచ్చింది. మొదటి షో టాక్ యావరేజ్ గా అనిపించినా ఫైనల్ గా చిత్రలహరి సాయి తేజ్ కు హిట్ కిక్ ఇచ్చింది. ఇదిలాఉంటే ఇన్నేళ్ల సిని కెరియర్ లో తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా షేర్ చేసుకోని సాయి తేజ్ మొదటిసారి తన తల్లిదండ్రుల డివోర్స్ గురించి ఓపెన్ అయ్యాడు.

15 ఏళ్ల క్రితమే తాను 10వ తరగతిలో ఉన్నప్పుడే అమ్మా నాన్నా విడాకులు తీసుకున్నారు. కలిసి ఉండి గొడవలు పడే కన్నా విడిపోయి సంతోషంగా ఉండటం బెటర్ అని వారు నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి అమ్మ తనని తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకుంది. అయితే తనకు ఓ తోడు కావాలని 2011లో మరో పెళ్లి చేసుకుంది. ఆయన ఓ డాక్టర్. అయితే ఇప్పటికి తన తండ్రితో మంచి రిలేషన్ ఉందని అన్నాడు సాయి తేజ్. ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబందించిన పర్సన్ కాదు అందుకే ఆయన దగ్గర సినిమాల గురించి ప్రస్థావించనని అన్నాడు సాయి తేజ్. తనని తమ్ముడిని అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటుంది. అందుకే అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు మేము అడ్డుచెప్పమని అన్నారు సాయి తేజ్.

Read more RELATED
Recommended to you

Latest news