మ‌హేష్ మూవీలో ద‌బాంగ్ బ్యూటీ!

-

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ `శ్రీ‌మంతుడు` మూవీ నుంచి త‌ను న‌టిస్తున్న చిత్రాల‌కు వ‌న్ ఆఫ్ ది పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న యంగ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ అడివిశేష్ న‌టిస్తున్న  చిత్రానికి కూడా వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వహ‌రిస్తున్నారు. ఎన్ ఎస్ జీ క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ లైఫ్ స్టోరీ స్ఫూర్తితో 26/11 ముంబై దాడుల ఆధారంగా `మేజ‌ర్‌` పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. `గూఢ‌చారి` ఫేమ్ శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ‌హేష్‌తో క‌లిసి సోని పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. వ‌చ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్‌ని పునః ప్రారంభించ‌బోతున్నారు. ఇందులో అడివిశేష్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇందులో ఇద్ద‌రు హీరోయిన్‌లు న‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ఓ హీరోయిన్‌గా `గూఢ‌చారి` ఫేమ్ శోభిత ధూళిపాల  కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఇక ప్ర‌ధాన హీరోయిన్‌గా `ద‌బాంగ్ 3` ఫేమ్ స‌యీ మంజ్రేక‌ర్ ని మేక‌ర్స్ తాజాగా ఫైన‌ల్ చేశారు. ‌యాభై శాతం షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news