Samantha: విడాకుల త‌రువాత.. జోరు పెంచిన సమంత.. ఒకేసారి మూడు సినిమాలు !

-

Samantha: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ ఫేర్ అక్కినేని నాగచైతన్య-సమంత ల‌దే. కానీ ఎవ్వ‌రి నీలి క‌న్నులు ఈ జంట మీద ప‌డ్డాయో గానీ.. వీరి వివాహ బంధం మున్నాళ్ల ముచ్చ‌ట‌గానే మారింది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా .. తమ వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వారి ప్ర‌క‌ట‌న తెలియ‌గానే ..సినిమా ఇండ‌స్ట్రీనే కాకుండా.. అక్కినేని అభిమాన లోకం ఒక్కసారిగా షాక్ కి గురైంది.

అయితే చైతుతో విడిపోయిన తరువాత సమంత తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్ప‌టికే ఓకే చెప్పిన ‘శాకుంతలం మూవీలో న‌టిస్తుంది. రెగ్యూల‌ర్ షూట్ లో పాల్గొంటున్న‌ట్టు తెలుస్తుంది. భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెర‌కెక్కిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పౌరాణిక‌ల నేప‌థ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

నిజానికి చాలా మంది నిర్మాతలు సమంతతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. కానీ విడాకులు గొడ‌వ‌తో ఏ ప్రాజెక్టు కూడా ఓకే చెప్ప‌లేదు. అయితే.. ఇప్పుడు.. అన్ని బాధ‌ల‌ను దూరం పెట్టి ధైర్యంగా
ముందుకు వ‌చ్చింది. రెగ్యూల‌ర్ షూటింగ్ ల్లో పాల్గొంటుంది. ఈ క్ర‌మంలో స‌మంత‌ను క‌లిసేందుకు నిర్మాతలు క్యూ క‌డుతున్నట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం స‌మంత చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

ఈ వారంలో లేదా వచ్చే వారంలో ఈ ప్రకటన బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.అవి ఏయే భాషలకు సంబంధించిన సినిమాలనే విషయంలో క్లారిటీ లేదు. అందులో ఒక‌టి.. కొత్త దర్శకుడితో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా ఆ సినిమాల‌తో బిజీ బిజీగా ఉంటే.. మ‌న‌సుకైనా బాధ‌ల‌ను మ‌రిచిపోవ‌చ్చ‌న‌ని ఆమె భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news