SAMPATH RAJ : ప్ర‌ముఖ న‌టితో పెళ్లి, డివోర్స్… అస‌లు నిజం చెప్పిన మిర్చి విల‌న్..!

-

ప్రస్తుతం సినిమా హీరోలకు ఎంత‌టి క్రేజ్ ఉందో విల‌న్ ల‌కు సైతం అంతే క్రేజ్ ఉంది. అందువల్లే హీరోలు సైతం విలన్ పాత్రల‌లో నటించడానికి ఇష్టపడుతున్నారు. ఇక టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న విల‌న్స్ లో సంపత్ రాజ్ కూడా ఒకరు. మిర్చి సినిమాతో సంపత్ రాజ్ విలన్ గా ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ గా సంపత్ రాజ్ న‌టించి ప్రేక్ష‌కులను మెప్పించారు.

త‌న‌ హైట్ పర్సనాలిటీ తో పాటూ గంభీర‌మైన గొంతుతో సంప‌త్ రాజ్ విలన్ క్యారెక్టర్ కు కచ్చితంగా సరిపోయారు. ఈ సినిమా తర్వాత సంపత్ రాజ్ అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. కానీ ఇప్పటికీ ప్రేక్షకులు ఆయనను మిర్చి సంపత్ రాజ్ గానే గుర్తు పెట్టుకున్నారు. కాగా తాజాగా సంపత్ రాజ్ ఆలీతో జాలీగా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను ఆయ‌న వెల్లడించారు.

తనకు ఏడుగురు అన్నదమ్ములు ఉన్నట్టు సంపత్ రాజ్ వెల్లడించారు. ఇక తన తల్లి తమిళనాడు కాగా తండ్రి తెలుగువారని చెప్పాడు. తను సినిమాల్లోకి రావడం తన తల్లికి ఇష్టం లేదని చదువురాని వాళ్లే సినిమాలు చేస్తానని తన తల్లికి ఒపీనియన్ వుండేదని తెలిపారు. కానీ త‌న తండ్రి మాత్రం నీకు న‌చ్చింది చేయాల‌ని చెప్పారని అన్నారు.

sampath raj sharanya realationship

అంతేకాకుండా నటి శరణ్య తనకు మాజీ భార్య అని అప్పట్లో కథనాలు రాశారని కానీ ఆమె తనకు స్నేహితురాలని చెప్పారు. శరణ్య భర్త కూడా తనకు మంచి స్నేహితుడని వాళ్ల పిల్లలతో కూడా తనకు పరిచయం ఉంద‌ని తెలిపాడు. శ‌రణ్య‌తో క‌లిసి తాను ఒక సినిమా చేశానని ఆ సినిమాలోని ఫోటోలను పట్టుకొని తన మాజీ భార్య శ‌ర్య‌ణ అంటూ ప్ర‌చారం చేశార‌ని సంప‌త్ రాజ్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆ వార్త‌లు చూశాక ఏం మాట్లాడాలో అర్థంకాలేద‌ని, ఇలాంటి పిచ్చి వార్త‌లు ఎందుకు రాస్తారో తెలియ‌దన్నారు. ద‌య‌చేసి ఇలాంటి పుకార్లు పుట్టించ‌వ‌ద్ద‌ని, నాలా చాలా మంది ఈ పుకార్ల వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్నార‌ని ఇప్ప‌టికైనా వ్య‌క్తిత్వాల‌ను కించ‌ప‌రిచేలా వార్త‌లు రాయొద్దంటూ విజ్ఞ‌ప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news