రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణలో పాలన- బండి సంజయ్

-

తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదని.. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణలో పాలన సాగుతుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. రాష్ట్రంలో విలేకరులు, కవులు, ప్రజాప్రతినిధులపై దాడులు జరగుతున్నాయని టీఆర్ఎస్ పార్టీని గురించి వివరించారు. నిన్న నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిని ఖండించారు.

ఇదిలా ఉంటే అరవింద్ పై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్ర బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై సమావేశం నిర్వహించింది. రేపు అన్ని జిల్లాల్లో బీజేపీ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అంతకుముందు ఎంపీ అరవింద్ మాట్లాడుతూ… నాపై పోలీసులు ప్లాన్ ప్రకారం దాడి జరిగిందంటూ విమర్శించారు. దాడి గురించి ముందస్తు సమాచారం అందించినా.. పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. తమపై దాడులు చేసింది రైతుల కాదని…టీఆర్ఎస్ గుండాలని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news