Shakuntalam: సైలెంట్ గా ఒటీటీలోకి వచ్చేసింది…

-

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. సమంత కెరీర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి నిర్మాతగా నీలిమ గుణ వ్యవహరించింది.

దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాని తెరకెక్కించారు. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం లోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యా కథాంశం పై తెరకెక్కించారు డైరెక్టర్ గుణశేఖర్. ఇదంతా ఇలా ఉంటే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్‌ అయింది. ఇక థియేటర్లలో మిస్‌ అయిన వారు… అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో చూసేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news