బీసీసీఐకి కాసుల పంట.. ఏకంగా రూ.9424 కోట్లు

-

ప్రపంచ క్రికెట్​ చరిత్రలోనే ఆదాయంలో ఆధిపత్యం చలాయిస్తున్న బీసీసీఐకి మరోసారి కాసుల పంట పండనుంది. 2023 నుంచి 2027 వరకు అయిదేళ్ల కాలానికి గాను ఐసీసీ నుంచి సుమారు రూ.9424 కోట్లను ఆదాయంలో వాటాగా బీసీసీఐ పొందనుంది. అంటే ఐసీసీ ఆదాయం (సుమారు రూ.24 వేల కోట్లు)లో దాదాపు 38.50 శాతం బీసీసీఐ ఖాతాలో చేరనుంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని ఓ ఐసీసీ సభ్యుడు తెలిపాడు.

ఏడాదికి ఐసీసీకి రూ.4918 కోట్లు ఆదాయం రానుందని అంచనా. క్రికెట్లో ర్యాంకింగ్‌, ఐసీసీ టోర్నీల్లో ప్రదర్శన, ఆటకు వాణిజ్య సహకారం తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని కొత్త ఆర్థిక విధానం ప్రకారం ఆదాయంలో సభ్య దేశాలకు వాటా ఇవ్వనున్నారు. దీని ప్రకారం చూసుకుంటే ఇంగ్లాండ్‌కు 6.89 శాతం, ఆస్ట్రేలియాకు 6.25 శాతం, పాకిస్థాన్‌కు 5.75 శాతం ఆదాయంలో వాటా దక్కే అవకాశముంది. 2018 నుంచి 2022 వరకు ఐసీసీ నుంచి 26 శాతం వాటాను బీసీసీఐ పొందింది.

Read more RELATED
Recommended to you

Latest news