ఆ డైరక్టర్ తో శర్వానంద్ క్రేజీ మూవీ..!

-

యువ హీరో శర్వానంద్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో పడి పడి లేచె మనసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫలితం నిరాశపరచగా ప్రస్తుతం సుధీర్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమాలో శర్వానంద్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్ చందు మొండేటి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.

కార్తికేయ సినిమాతో తన ప్రతిభ చాటుకున్న చందు మొండేటి ఆ తర్వాత ప్రేమం రీమేక్ తో సక్సెస్ అందుకున్నాడు. ఇక సవ్యసాచి సినిమా ఎన్నో అంచనాలతో వచ్చినా సక్సెస్ అందుకోలేదు. చందు మొండేటితో శర్వానంద్ సినిమా అంటే మరో ప్రయోగం చేస్తున్నట్టే. సుధీర్ వర్మ సినిమాతో పాటుగా 96 రీమేక్ లో కూడా శర్వానంద్ నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news