ఆది పురుష్ మూవీని ఎంతకి అమ్మేసారో తెలిస్తే షాక్..!

-

టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అన్నీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక జూన్ 16వ తేదీన ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ జోరుగా పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడించడం జరిగింది.

ఇకపోతే ఈ సినిమాలో రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ ఖాన్ తదితరులు కీలకపాత్రను పోషించడం జరిగింది. ఇక ఈ సినిమాని హిందీలో భారీ బడ్జెట్ తో టీ – సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా రూ. 550 కోట్ల బిజినెస్ జరిగింది అని, డిజిటల్ సాటిలైట్ హక్కులు ఏకంగా రూ.250 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా తెలుగు హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూ.175 కోట్లకు డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఇంత మొత్తంలో ఆది పురుష్ హక్కులను సొంతం చేసుకోవడానికి కారణం ప్రభాస్ ఇమేజ్ అని సమాచారం.

ఇకపోతే ఏరియాల వారీగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తమ సినిమా హక్కులను ఒక్కొక్కరిగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇకపోతే గోదావరి జిల్లాల రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయినట్లు.. నైజాం ఏరియా రిలీజ్ రైట్స్ రూ.60 కోట్లకు మైత్రి మూవీ మేకర్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా విడుదలకు ముందే భారీగా బడ్జెట్ రాబట్టినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news