శ్రద్ధాదాస్ నయా అవతార్..నచ్చిన వ్యక్తి కోసం ఆ పని చేసిన భామ

-

‘‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బ్యూటిఫుల్ లేడీ శ్రద్దాదాస్. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది ఈ సుందరి. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నడుముందాలపైనే ‘శ్రద్ధ’ వహించి వాటిని చూపిస్తూ పిచ్చెక్కిస్తుంటుంది ఈ భామ.

లేటెస్ట్ గా ఈ అమ్మడు ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ లో హోస్ట్ గా కనిపించి మెస్మరైజ్ చేసింది. ఈ భామ ఈ ప్రోగ్రామ్ లో చేసిన సందడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో శ్రద్ధాదాస్..‘జబర్దస్త్’ కంటెస్టెంట్ ప్రవీణ్..కోసం నయా అవతారం ఎత్తింది.

స్కిట్ లో భాగంగా ప్రవీణ్..‘సరి లేరు నీకెవ్వరు’లో మహేశ్ బాబు స్కూప్ తో వచ్చాడు. అంతే ఇక.. స్కిట్ తర్వాత శ్రద్దాదాస్..ప్రవీణ్ కోసం స్పెషల్ గా ‘1:నేనొక్కడినే’ సినిమాలోని ‘ ఒక గంటల వచ్చేయిరా’ అనే సాంగ్ పాడింది. దాంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు.

ఇక గోవా బీచ్ కు ఎప్పుడెళ్దాం? అని ప్రవీణ్ శ్రద్ధాదాస్ ను అడిగి నవ్వులు పూయించాడు. ‘ఏక్ మినీ కథ’ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఒరిజినల్ లో తెలుగు ప్రేక్షకులకు చివరగా శ్రద్ధాదాస్ కనిపించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆకెళ్ల వంశీ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘అగ్గి పుల్ల’ ఫిల్మ్ లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news