నెట్‌ఫ్లిక్స్ థ్రిల్ల‌ర్ కోసం క్రేజీ జోడీ !

-

పాపుల‌ర్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం క్రేజీ జోడీ క‌ల‌సి ప‌నిచేయ‌బోతున్నారా? అంటే అవునే స‌మాధానం వినిపిస్తోంది. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లిన త‌రువాత ఓటీటీ బిజినెస్ ఊపందుకున్న నేప‌థ్యంలో రానా, శృతిహాస‌న్ క‌లిసి నెట్ ఫ్లిక్స్ కోసం ఓ క్రేజీ వెబ్ సిరీస్ కోసం ప‌నిచేయ‌బోతున్నార‌ని తెలిసింది. భిన్న‌మైన కుటుంబ నేప‌థ్యాల నుంచి వ‌చ్చిన ఈ ఇద్ద‌రు వైవిద్యం కోసం కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తూనే వున్నారు.

అందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ థ్రిల్ల‌ర్ సిరీస్‌లో న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. ఒక ప్ర‌ముఖ తెలుగు ర‌చ‌యిత ఈ వెబ్ సిరీస్‌కి క‌థ‌ని అందిస్తున్నారు. తెలుగులో రూపొంద‌నున్న ఈ వెబ్ థ్రిల్ల‌ర్‌ని మొత్తం ప‌ది భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇది మొత్తం ప‌ది ఎపిసోడ్‌లు వుంటుంద‌ట‌. రోమాంచితంగా ఓళ్లు గ‌గుర్పొడిచే స‌న్నివేశాల‌తో సాగుతుంద‌ని దీనికి సంబంధించిన ద‌ర్శ‌కుడు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌ట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news