ఈనెల 15, 16 తేదీల్లో దుబాయ్​లో ‘సైమా’ వేడుకలు

-

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘సైమా’ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌) వేడుకలు ఈసారి సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్ వేడుకగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, నిధి అగర్వాల్‌, సైమా ఛైర్​పర్సన్​ బృందా ప్రసాద్‌, మారుతి సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ హాజరయ్యారు.

సైమా అంటే సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నీ కలిసి జరుపుకునే వేడుక.. గత 11 ఏళ్లుగా నేను ఈ వేడుకల్లో భాగమవుతున్నాను అని రానా అన్నారు. ప్రతీసారి కొత్తగా మొదలుపెట్టిన ఉత్సాహం, సంతోషం కలుగుతోందని.. ఓ మంచి వేదికని ఏర్పాటు చేసి.. కళలపై ఒకే రకమైన అభిరుచి ఉన్న అందరినీ ఒకచోటకి చేర్చడంలో సైమా విజయవంతమైందని కొనియాడారు. అవార్డులు ఎవరికి వస్తే బాగుంటుందనే అంశం కంటే.. ఎంత ఎక్కువ మంది నటీనటులు ఈ వేడుకలో పాల్గొంటే అంత బాగుంటుందనేది తన అభిప్రాయమని రానా చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news