తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో విద్యాసంస్థలు బంద్‌

-

ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా స్కూల్ లకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. అత్యధికంగా డిచ్ పల్లి మండలం గన్నారం లో 14 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. గాంధారి, సిరికొండ లో 12 సెంటిమీటర్లు అయింది. సదా శివ నగర్ జుక్కల్ , జక్రాన్ పల్లి లో 11 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

school bandh in nzb

డిచ్ పల్లి, మదన్ పల్లి లో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. జిల్లా కేంద్రం లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తరుణంలోనే ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా స్కూల్ లకు సెలవు ప్రకటించారు. లోకల్ హాలి డే గా ప్రకటించారు విద్యాశాఖ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news