గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన సోనూ సూద్

-

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటాడు నటుడు సోనూ సూద్. మొన్న లాక్ డౌన్ వలన ఇబ్బంది పడిన వేలాది మంది వలస కూలీలను జాతీయస్థాయిలో ఆదుకున్న సినీ నటుడు సోనూ సూద్ కు మంచి పెటు వచ్చింది. ఈయనకు ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేయగా దానిని స్వీకరించిన తాను మొక్కలు నాటినట్లు సోనూ సూద్ తెలిపారు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఆలోచన చేయడం ఇలా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కరోనా లాక్ డౌన్ ఆ తరువాత తదనంతర కాలంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పెరిగిందన్న సోనూ చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సోనూ సూద్ పిలుపు నిచ్చారు. ఇక తాను నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమా షూట్ కోసం నిన్ననే సోనూ ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news