శ్రీ రెడ్డి, కత్తి మహేష్, మహా మూర్తి.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టులు వీరేనా..?

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ మూడవ పార్ట్ అదేనండి కథనాయకుడు, మహానాయకుడులో చూపించిన ఎన్.టి.ఆర్ జీవిత అసలు కథను తాను చూపిస్తా అని చెబుతున్న సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ప్రోమోస్ తోనే అదరగొడుతున్నాడు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ అయిన వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అలాంటి కాంట్రవర్సీలు కలిగిన వారినే గెస్టులుగా పిలుస్తున్నాడట.

ఇంతకీ వర్మ ఎవరెవరిని పిలుస్తున్నాడు అంటే సంచలనాల శ్రీరెడ్డి, బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్, మహా న్యూస్ నుండి ప్రస్తుతం టివి5కి మారిన మూర్తి ఈ ముగ్గురిని వర్మ పిలుస్తున్నాడట. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఈవెంట్ లో ఈ ముగ్గురే స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు. అయితే ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన వారే. మరి ఈ ఈవెంట్ ఎలా ఉంటుంది.. వీళ్ల పబ్లిసిటీ సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version