మరోసారి సీఎం జగన్ పై తన ప్రేమను కురిపించిన శ్రీరెడ్డి..!

-

గత ఎన్నికలలో ఘోరపరాజయం తర్వాత టీడీపీ కి తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాస్త ఊరట ఇచ్చాయని చెప్పాలి. అనూహ్యంగా నాలుగు ఎమ్మెల్సీ సీట్లు సొంతం చేసుకోవడంతో చంద్రబాబు కళ్ళల్లో చాలా సంవత్సరాల తర్వాత సంతోషం కనిపిస్తోంది. ఇదే జోష్లో వచ్చే ఎన్నికలలో గ్రాండ్ విక్టరీ కొట్టబోతున్నామని శపదాలు కూడా చేస్తున్నారు. అయితే అధికార వైసిపి మాత్రం మీకు అంత సీన్ లేదులే కానీ ..175 స్థానాలు మావే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే అధికార వైసీపీలో ఉంటూనే ప్రతిపక్షానికి కొమ్ముకాస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నలుగురి ఎమ్మెల్యేలను విషపురుగులతో పోల్చుతూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.. “మీ ఆశయాల మీద నమ్మకంతో మీరేమీ ఇవ్వకున్నా.. మీ మీద ప్రేమతోనే .. నీతోనే నడిచే వాళ్ళం మేమంతా ఉన్నాము .. విషపురుగులు విషమే తప్ప అమృతాన్ని కురిపిస్తాయా జగనన్న.. పదవి, కోట్లు ఇవ్వకున్నా మిమ్మల్ని నమ్మి మీ వెంటే నడవడానికి చాలామంది ఉన్నారు.. చంద్రబాబును నమ్మే విష పురుగులు కూడా ఉంటాయి జాగ్రత్త జగనన్న.. జై జగనన్న” అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

వాస్తవానికి శ్రీరెడ్డి వైసీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తుంది కానీ ఆమెకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేదు. కానీ ప్రచారంలో మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను తిట్టించడానికి శ్రీ రెడ్డిని వైసిపి వస్త్రంగా వాడుకుంటుంది. అందుకుగాను ఆమెకు కోట్ల రూపాయలు ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ తాను మాత్రం పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేసింది. మొత్తానికి అయితే మరొకసారి శ్రీరెడ్డి జగన్ పై ఉన్న తన ప్రేమను చాటుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news