సెలెబ్రిటీలతో కబడ్డీ ఆడించనున్న శ్రీముఖి!

-

బిగ్‌బాస్ మూడో సీజన్ రన్నర్‌గా నిలిచిన శ్రీముఖి.. ప్రస్తుతం బుల్లితెరపై అడపాదడపా షోలను చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొనక ముందు శ్రీముఖి క్షణం తీరిక లేకుండా పటాస్ షోతో బిజీగా ఉండేది. బుల్లితెరపై వినోదాత్మక షోలను, ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉండే శ్రీముఖి ప్రస్తుతం కొత్త కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వస్తోంది.

బిగ్‌బాస్ షోతో శ్రీముఖికి ఫాలోయింగ్ పెరిగినా.. అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. అంతకు ముందు దూసుకుపోయినట్టుగా బుల్లితెరపై హవా కొనసాగించలేకపోతోంది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక కొన్ని రోజలు విశ్రాంతి తీసుకున్న శ్రీముఖి.. స్టార్ మా చానెల్‌లో ఓ కొత్త ప్రోగ్రామ్‌కు సైన్ చేసింది. స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అంటూ కొత్తగా ట్రై చేసినా..అంతగా వర్కౌట్ కాలేదు.

తాజాగా జెమినీ చానెల్‌లో మరో కొత్త షో ప్రారంభించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో శ్రీ ముఖి ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. జెమినీ టీవీలో నేటి నుంచి సెలెబ్రిటీ కబడ్డీ లీగ్ ప్రారంభం కాబోతోంది..ప్రతీ గురు, శుక్రవారం రాత్రి 9 30గంటలకు ప్రసారమవుతుందని ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news