‘ఆర్ఆర్ఆర్’ అప్ డేట్ : ఎన్టీఆర్ ఫోటోలు లీక్ అవడంతో రాజమౌళి షాకింగ్ నిర్ణయం…..!!

-

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. మెగా, నందమూరి హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఆయా హీరోల ఫ్యాన్స్ తోపాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్

కొమరం భీంగా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.
స్వాతంత్రోద్యమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక నిన్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో ఎన్టీఆర్ కొమరం భీం లుక్ ని కొందరు వీడియో తీసి దానిని సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. కాగా ఆ వీడియో నిన్నటినుండి విపరీతంగా వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ లీక్ వీడియో ఘటనతో దర్శకుడు రాజమౌళి ఒకింత తన టీమ్ పై సీరియస్ అయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

అందుకే నేటి నుండి షూటింగ్ స్పాట్ కి సెల్ ఫోన్స్, మరియు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వంటివి పూర్తిగా నిషేధించినట్లు తెలుస్తోంది. అయితే ఇటువంటివి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా మధ్యలో ఎవరో ఒకరు దొంగతనంగా ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తున్నారని, ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తుంటే, ఈ విధంగా తప్పుడు దారుల్లో వాటిని లీక్ చేయడం సరైనది కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం 75 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2020 జులై 30న రిలీజ్ చేయబోతున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news