సునీత కూతురు గ్రాండ్ ఎంట్రీ

-

ఏ పరిశ్రమలో అయినా వారసత్వం అనేది కామనే.. హీరోలు కొడుకులు హీరోలు.. పొలిటిషియన్ కొడుకులు మరో పొలిటిషియన్ అవుతుంటారు. అలానే పరిశ్రమలో మిగతా విభాగాల్లో కూడా ఇది విస్తరించింది. సంగీత దర్శకుల కొడుకులు సంగీత దర్శకులుగా మారుతున్నారు. లేటెస్ట్ గా ఇదే కోవలో సింగర్ సునీత తనయ శ్రేయా సింగర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సవ్యసాచి సినిమాలో ఓ పాట పాడింది శ్రేయా. నిన్న జరిగిన సవ్యసాచి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ మీద కూడా పాట పాడి అలరించింది శ్రేయా. సింగర్ గా సునీత ప్రస్థానం అందరికి తెలిసిందే. ఆమె వారసురాలిగా శ్రేయా అరంగేట్రం చేసింది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో శ్రేయా ఎలాంటి ఫీడ్ బ్యాక్ అందుకుంటుందో చూడాలి. సినిమాలో మెలోడీ సాంగ్ పాడిన శ్రేయా చూస్తుంటే సునీత వారసత్వాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news