సూప‌ర్ మ‌చ్చి అంటున్న క‌ళ్యాణ్‌దేవ్‌

-

రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మ్మెంట్ బ్యాన‌ర్‌పై చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ హీరోగా రెండో చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. పులి వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.  దీపావ‌ళి సంద‌ర్భంగా సూప‌ర్‌మ‌చ్చి అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తూ చిత్ర యూనిట్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. వ‌ర్షంలో స్నేహితుల న‌డుమ హీరో క‌ల్యాణ్‌దేవ్ న‌వ్వుతూ ఉండే లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

బాలీవుడ్ బ్యూటీ రెహ చ‌క్ర‌వ‌ర్తి హీరోయిన్‌గా న‌టిస్తుంది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. న‌వంబ‌ర్ 8న విడుద‌ల కానున్న శ్రీవిష్ణు `తిప్ప‌రామీసం` చిత్రాన్ని నిర్మించిన రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో రూపొందుత‌న్న చిత్ర‌మిది.

Read more RELATED
Recommended to you

Latest news