BREAKING : టాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి..

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌ అసిస్టెంట్‌ దర్శకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన హయత్‌ నగర్‌ లో చోటు చేసుకుంది. శ్రీరామ్‌ నగర్‌ కాలనికి చెందిన మరిగంటి కార్తీక్‌ కుమార్‌ చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 14 వ తేదీన కార్తీక్‌ కుమార్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు.

కార్తీక్‌ తన బైక్‌పై బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కార్తీక్‌ చివరిగా తన సోదరుడు సందీప్‌ తో ఫోన్‌ లో మాట్లాడాడు. ఆ తర్వాత కార్తీక్‌ కు ఫోన్‌ చేసిన కలవలేదని.. కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ.. హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కంప్లైంట్‌ ఇచ్చారు.

ఆ తర్వాత 16 వ తేదీన జీవీఆర్‌ క్రికెట్‌ అకాడమీ వద్ద ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. అనుమానంతో కార్తీక్‌ కుమార్‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 17 వ తేదీన కార్తీక్‌ కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని పరిశీలించగా.. అది తమ కార్తీక్‌ దే అని గుర్తించారు దీంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇక ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news