ఎట్ట‌కేల‌కు పెళ్ళి పీట‌లెక్క‌బోతున్న‌ రొమాంటిక్ హీరో!

-

త‌మిళంలో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న శింబు ఎట్ట‌కేల‌కు పెళ్ళి చేసుకోబోతున్నార‌ట‌. తమ బంధువుల్లోని ఓ అమ్మాయిని వివాహం చేసుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. శింబు త‌ల్లి ఉషా ఓ అమ్మాయిని చూడ‌గా, అందుకు శింబు ఓకే చెప్పార‌ట‌.

సినిమా ప‌రిశ్ర‌మ‌కు పెళ్ళి క‌ళ వ‌చ్చింది. గ‌త రెండేండ్లుగా బాలీవుడ్‌లో పెళ్ళి సంద‌డి కొన‌సాగుతుంది. అనుష్క శ‌ర్మ‌, సోన‌మ్ క‌పూర్‌, దీపికా ప‌దుకొనె, ప్రియాంక చోప్రా, టాలీవుడ్ హీరోయిన్ శ్రియా పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ జీవితాన్ని ప్రారంభించారు.

మ‌రోవైపు సౌత్‌లో నాగ‌చైత‌న్య‌, స‌మంత ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. త‌మిళంలో ఇటీవ‌ల ఆర్య‌, ఆయేషా సైగ‌ల్ వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. విశాల్ హైద‌రాబాద్‌కి చెందిన అనీషా అనే న‌టితో ఎంగేజ్‌మెంట్ కుదుర్చుకున్నారు. త్వ‌ర‌లో వీరు ఒక్క‌టి కాబోతున్నారు. ఇప్పుడు త‌మిళంలో మ‌రో పెళ్ళి సంద‌డి షురూ కాబోతుంది.

త‌మిళంలో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న శింబు ఎట్ట‌కేల‌కు పెళ్ళి చేసుకోబోతున్నార‌ట‌. తమ బంధువుల్లోని ఓ అమ్మాయిని వివాహం చేసుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. శింబు త‌ల్లి ఉషా ఓ అమ్మాయిని చూడ‌గా, అందుకు శింబు ఓకే చెప్పార‌ట‌. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే ఆగ‌స్ట్ లో వీరి వివాహం జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్రేమ‌ల‌న్నీ పోగా, చివ‌ర‌కు శింబుకి పెద్ద‌లు కుదిర్చిన పెళ్ళి నే గ‌తైందని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే శింబు పెళ్ళి ఎప్పుడో కావాల్సింది. ఆయ‌న కోలీవుడ్‌లో చాలా మంది క‌థానాయిక‌ల‌తో ప్రేమాయ‌ణం సాగించారు. మొద‌ట ప్ర‌స్తుతం సౌత్‌లో స్టార్ హీరోల‌కు ధీటుగా రాణిస్తున్న న‌య‌న‌తార‌తో డేటింగ్ చేశారు. వీరిద్ద‌రు చెన్నై వీధుల్లో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. గాఢంగా ప్రేమించుకుని పెళ్ళి వ‌ర‌కు వెళ్ళారు. అనుకోకుండా చివ‌ర్లో బ్రేక‌ప్ చెప్పుకున్నారు. దీంతో అప్ప‌ట్లో ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. దీని వ‌ల్ల అటు శింబు, ఇటు న‌య‌న‌తార బాగా డిస్ట్ర‌ర్బ్ అయ్యారు.

ఆ త‌ర్వాత కొద్ది గ్యాప్‌తో హ‌న్సిక‌కి ప్రేమ పాఠాలు చెప్పాడు శింబు. దాదాపు రెండేండ్ల పాటు వీరిద్ద‌రు క‌లిసి తిరిగారు. అంత‌కు మించి చాలా చేశారు. ఉన్న‌ట్టుండి 2014లో త‌మ బంధానికి ముగింపు ప‌లుకుతున్న‌ట్లు, తామిద్ద‌రు సింగిల్‌గా ఉండాల‌నుకుంటున్న‌ట్టు శింబు ప్ర‌క‌టించారు. దీంతో ఇదో సంచ‌ల‌నం అయ్యంది.

ఆ త‌ర్వాత త్రిష‌తో, శృతి హాస‌న్‌తో చ‌నువుగా ఉన్న‌ట్టు కొన్ని రోజులు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అవి కేవ‌లం రూమ‌ర్స్ గానే మిగిలాయి. ప్రేమ జీవితంలో కెరీర్ ప‌రంగా బాగా డిస్ట‌ర్బ్ అయిన శింబు గ‌తేడాది నుంచి కెరీర్‌పై దృష్టి సారించారు. వ‌రుస‌గా సినిమాలు ద‌క్కించుకుంటూ కోల్పోయిన సినీ జీవితాన్ని తిరిగి భ‌ర్తీ చేసుకుంటున్నాడు. ప్రేమ కాదు, జీవితం ముఖ్య‌మ‌ని తెలుసుకున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న హ‌న్సిక‌తో క‌లిసి మ‌హాతో పాటు మానాడు అనే మ‌రో సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version