సావిత్రి కథే ‘సీత’గా మారిందట..!

-

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన డైరక్టర్ తేజ ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరక్షన్ ఛాన్స్ వచ్చినా ఆ సినిమా చేయనని బయటకు వచ్చాడు. ప్రస్తుతం తేజ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సీత. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కథ వెంకటేష్ కోసం రాసిన కథ అని తెలుస్తుంది.

రానాతో హిట్ కొట్టిన వెంటనే వెంకటేష్ తో తేజ సావిత్రి సినిమా చేయాలని చూశాడు. సురేష్ బాబు నిర్మాతగా ఆ సినిమా వస్తుందని అన్నారు. కాని ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. అయితే ఆ సినిమా కథనే కాస్త మార్చి సీతగా తీస్తున్నాడట తేజ. సావిత్రి టైటిల్ ను ఆల్రెడీ నారా రోహిత్ వాడేశాడు కాబట్టి సావిత్రి ప్లేస్ లో సీత అని టైటిల్ పెట్టారట. ఈ సినిమాలో కాజల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందట. వెంకటేష్ తో భార్యాభర్తల కథగా రాసుకోగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు మాత్రం ప్రేమికుల కథగా మార్చాడట. మరి ఈ సినిమాతో తేజ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news