సైలెంట్ గా కానిచ్చేసిన తెలుగు హీరో త్రిగున్.. ఫొటోస్ వైరల్..!

-

ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలు ఒకరి తర్వాత ఒకరు బ్యాచిలర్ లైఫ్ వీడి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కాగా.. వరుణ్ తేజ్ కూడా హీరో లావణ్య త్రిపాఠి ని ప్రేమించి ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక వీరి వివాహం ఇటలీలో జరగబోతుందని.. అది కూడా డిసెంబర్లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి మరో యంగ్ హీరో త్రిగున్ కూడా చేరిపోయారు. టాలీవుడ్ లో అనేక సినిమాలు చేసి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఈయన.. జెనీలియాతో కలిసి కథ అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా.. పెద్దగా గుర్తింపు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ మెప్పించాడు.

అలా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన గరుడవేగ సినిమాలో కీలకపాత్ర పోషించిన త్రిగున్ ఆ తర్వాత డియర్ మేఘ, డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ వంటి సినిమాలలో హీరోగా నటించారు. ఇక వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కొండ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన ఈయన ఇప్పుడు ఒక ఇంటివాడు అయ్యాడు. పెద్దలు కుదిర్చిన వివాహమే ఆయన చేసుకున్నాడు. నివేదిత అనే అమ్మాయిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం శ్రీ సెంటర్ మహల్ అవినాశి, తమిళనాడులోని తిరుపూర్ లో జరిగింది. ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నిజానికి త్రిగున్ అసలు పేరు అరుణ్ ఆదిత్. ఇదే పేరుతో తెలుగు, తమిళ్లో హీరోగా కొన్ని సినిమాలు చేసి 2022లో తన పేరును త్రిగున్ గా మార్చుకున్నాడు. జాతకం ప్రకారం ఈ పేరు అయితే బాగుంటుందని , హీరోగా సక్సెస్ అవుతాడని అనుకున్నప్పటికీ పెద్దగా కలిసి రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news