భ్రమరాంబ థియేటర్ ను విజిట్ చేయనున్న “తంగలాన్” చిత్ర యూనిట్..!

-

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో, కబాలి దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ తంగలాన్. ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే మంచి కలెక్షన్లను రాబట్టింది. తంగలాన్ మూవీకి తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ నేపథ్యంలోనే కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ ను ఇవాళ తంగలాన్ చిత్ర యూనిట్ సందర్శించనుంది. హీరో చియాన్ విక్రమ్, డైరెక్టర్ పా.రంజిత్, నిర్మాత జ్ఞానవేల్ రాజా, మాళవిక మోహనన్ విజిట్ చేయనున్నారు. సాయంత్రం 6.30 గంటల షోకి వీరు పాల్గొని అభిమానులతో ముచ్చటించనున్నారు. ఈ విషయాన్ని కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించింది మూవీ టీమ్. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చారు. లాంగ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తోంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version