40 యేళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం అదే – నటి ఊర్వశి..!!

-

టాలీవుడ్ , కోలీవుడ్ ప్రేక్షకులకు అలనాటి నటి ఊర్వశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించి తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించింది.. ముఖ్యంగా సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కూడా నటించింది. ఊర్వశి 2000 వ సంవత్సరంలో నటుడు మనోజ్ కే జయన్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. వీరికి తేజ లక్ష్మి అనే కూతురు కూడా జన్మించింది. అయితే కొన్ని కారణాల చేత విభేదాలు రావడంతో 2008లో వీరిద్దరు విడిపోయారట.

ఆ తర్వాత నటి ఊర్వశీ చెన్నైలో శివప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది వీరికి ఇషాన్ ప్రజాపతి అనే కొడుకు జన్మించారు. ఇక నటుడు మనోజ్ కూడా మరొకరిని వివాహం చేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఊర్వశి తన మొదటి పెళ్లి గురించి, విడాకుల వ్యవహారం గురించి క్లారిటీ ఇచ్చింది.. తన మొదటి భర్తతో తాను విడిపోవడానికి ఒకే ఒక కారణం తాగుడు అలవాటని, అతడి ఇంట్లో అందరూ ముందు తాగుతారు.. కుటుంబం అంతా కలిసి తాగుతారు.. తనను కూడా తాగమని చాలా బలవంతం చేసేవారు..అలా రోజు తాగి తాగి నేను కూడా తాగుబోతులా తయారయ్యానని తెలిపింది.


అతని వల్లే నేను కూడా ముందుకు బానిస అయ్యాను. అదే మా విడాకులకు కారణమయ్యింది. దీంతో నా కూతుర్ని నాకు దక్కకుండా చేశారు. తనని మందుకు బానిస చేసి తన కూతురు బాధ్యతలని తానే చూసుకుంటానని చెప్పి తన కూతురిని తీసుకుపోయారని.. దీంతో ఒంటరిదాన్ని అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయి చాలా కాలం పాటు తనలో తాను కుమిలిపోయానని తెలిపింది ఊర్వశి. ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్ శివప్రసాద్ ను వివాహం చేసుకున్నాను అప్పుడు నా వయసు 40 సంవత్సరాలు అంటూ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news