సీనియర్ నటి నిరోషా ఇంట్లో దొంగతనం..!

-

ప్రస్తుతం కోలీవుడ్ లో ఉన్న సెలెబ్రిటీల ఇళ్లల్లో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంతకుముందు ఐశ్వర్య రజనీకాంత్, సీనియర్ నటి శోభన, సింగర్ విజయ్ ఏసుదాస్ వంటి వారి ఇళ్ళల్లో దొంగతనాలు జరగగా.. ఇప్పుడు తాజాగా సీనియర్ హీరోయిన్ నిరోషా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశం గా మారింది. ముఖ్యంగా తన ఇంట్లో బంగారు ఆభరణాలతో పాటు ఆస్తి పత్రాలు కూడా కాజేశారు అంటూ చెన్నైలోని తేనంపేట పోలీసులకు నటి నిరోష ఫిర్యాదు చేశారు.

నిరోషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా.. నగలతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా పోయాయి అని ఆమె తెలిపారు. కొన్ని నెలల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో కూడా ఇలాంటి దొంగతనమే జరగగా.. దీని మీద విచారణ జరిపిన పోలీసులు ఇంటి దొంగలే ఈ పని చేశారని గ్రహించి అసలు దొంగ ఎవరో తేల్చేశారు . ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పని చేసే మహిళ ఈ దొంగతనం చేసినట్లుగా తేల్చారు. మరొకవైపు సీనియర్ నటి శోభన ఇంట్లో కూడా దొంగతనం జరగగా ఈ ఘటనలో కూడా ఆమె ఇంట్లో పనిచేసే మహిళ ఈ దొంగతనానికి పాల్పడింది అంటూ పోలీసులు నిరూపించారు.

ఇప్పుడు సింగర్ విజయ్ ఏసుదాసు ఇంట్లో జరిగిన దొంగతనం విషయంలో ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం నటి నిరోషా ఇంట్లో కూడా దొంగతనం వెలుగు చూడడంతో దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అన్న విషయం త్వరలోనే తెలియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news