ఐశ్వర్యారాయ్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్..!

-

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు సౌత్ సినిమాలు అలాగే అటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. ఇక వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా జన్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఒకానొక సమయంలో భారతదేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకుని నటీమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య గత మూడు దశాబ్దాల కెరియర్ లో భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సినిమాతో మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్య ఇప్పుడు సినిమాలు తగ్గించింది.. అయినా కూడా ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదని చెప్పాలి. సినిమాల ద్వారా ఆమె ఎంత ఆస్తి సంపాదించింది అనే విషయం మరొకసారి నెట్టింట వైరల్ గా మారగా.. పలు అంతర్జాతీయ సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఐశ్వర్య అనేక కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న ఈమె ఇప్పటివరకు సుమారుగా రూ.800 కోట్లకు పైగా ఆస్తి కూడబెట్టినట్లు సమాచారం.

ముంబైలోని జూహూ పరిసర ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన భవనంలో ఈమె నివసిస్తున్నారు. దీని ఖరీదు రూ.112 కోట్లు. ఇకపోతే ఐశ్వర్య రాయ్ బచ్చన్ 2017లో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్లో విశాలమైన 5 బి హెచ్ కే అపార్ట్మెంట్ ను కూడా కొనుగోలు చేసింది. దీని విలువ రూ.21 కోట్లు అలాగే అపార్ట్మెంట్ స్కైలార్క్ టవర్స్ లో 37వ అంతస్థులో రూ.41 కోట్ల విలువైన భవంతిని కొనుగోలు చేసింది. అలాగే రూ.7.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసింది. దీంతోపాటు మరో రూ .4కోట్ల విలువైన రెండు కార్లు కూడా ఆమె సొంతం.

Read more RELATED
Recommended to you

Latest news