ఏపీ నేతన్నలకు శుభవార్త.. రేపు అకౌంట్లలోకి రూ.24,000

-

ఏపీ నేతన్నలకు శుభవార్త.. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నేతన్న నేస్తం’ పథకం కింద లబ్ధిదారులకు రేపు సీఎం జగన్ నిధులు అందించనున్నారు. 80,686 మంది ఖాతాల్లో రూ. 24 వేల చొప్పున మేర జమ చేస్తారు.

ఇప్పటికే అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. కాగా, ఈ పథకం ద్వారా గత నాలుగేళ్లలో నేతన్నలకు రూ.776 కోట్ల సాయం అందింది. ఇక అటు MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాలకు YSR వర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రకోట కింద సీట్లను భర్తీ చేయనుంది. నీట్ లో ర్యాంకులు సాధించిన వారు నేటి నుంచి 26 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు https://drysr.uhsap.in లో చూడగలరు. 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన ప్రైవేట్, మైనార్టీ, వైద్య, డెంటల్ కాలేజీల్లో కాంపిటేంట్ కోటా MBBS, BDS సీట్లలో 100% రాష్ట్ర విద్యార్థులకే దక్కేలా ఇటీవల ప్రభుత్వం సవరణలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news