ఈ ఏడాది పెళ్లిపీటలెక్కబోయే టాలీవుడ్ బ్యూటీస్ వీళ్లే!

-

గతేడాది టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్లలో చాలా మంది హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ ఏడాదిలోనూ పలువురు సినీ తారలు పెళ్లి పీటలెక్కేలా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది రిలేషన్షిప్లో ఉండగా ఈ ఏడాదిలో సెటిల్ అవుదామనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. చాలా మందే పెళ్లి పీటలెక్కారు. కొత్త ఏడాదిలో ఆ జాబితా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, తమన్నా భాటియా, అదితిరావు హైదరీ తదితరులు ఉన్నారు. వీళ్లతోపాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

రకుల్ ప్రీత్సింగ్ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. తాజాగా ఈ జంట పెళ్లికి ముహూర్తం కుదిరినట్టు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తమన్నా కూడా రకుల్ బాటలోనే బీ టౌన్ నటుడు విజయ్‌ వర్మతో ప్రేమలో ఉంది. వీళ్లు కూడా పెళ్లికి సిద్ధమవుతున్నారట. అదితిరావు హైదరీ కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీళ్లు కూడా ఈ సంవత్సరం వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సంయుక్త మేనన్‌ కూడా పెళ్లి ఏర్పాట్లలో ఉండటంతోనే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదనేది టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ భామల్లో ఈ ఏడాది ఎవరు పెళ్లి బంధంతో ఒక్కటవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news