టాలీవుడ్ ప్రొడ్యుస‌ర్ ఇంట్లో తీవ్ర విషాదం..మాజీ సీఎం కూతురు మృతి!

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు మరణించారు. వివిధ కారణాల తో… టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటీనటులు మరణించారు. అయితే ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఇంట్లో.. విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి తాజాగా మరణించారు.

tollywood, Popular producer Shyam Prasad Reddy

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో… నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి బాధపడుతున్నారు. అయితే నిన్న అంటే బుధవారం రోజున రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వరలక్ష్మి మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. వరలక్ష్మి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి కుమార్తె కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news