ఒకే ఫ్రేమ్ లో స్టార్ హీరోస్.. పిక్చర్ అదిరిందిగా..!

-

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒకచోట చేరితే ఆ కిక్ వేరేలా ఉంటుంది. వారికెలా ఉన్నా వారి అభిమానులకు మాత్రం అదో పండుగ అన్నట్టే. రీసెంట్ గా రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లిలో స్టార్స్ హంగామా అందరికి తెలిసిందే. ప్రభాస్, ఎన్టీఆర్, రాం చరణ్, రానా, నానిలు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఈ కార్యక్రమంలో వారి ఆట పాటల అల్లరి అంతా వీడియోల రూపంలో బయటకు వచ్చాయి.

అయితే ఈ పెళ్లికి అటెండ్ అయిన హీరోలంతా కలిసి ఒకే ఫ్రేమ్ లో ఫోటో దిగింది లేదు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీర్చేలా ఓ పిక్ వచ్చింది. ప్రభాస్, రానా, రాం చరణ్, ఎన్.టి.ఆర్, నాని ఇలా అందరు ఒకే ఫ్రేం లో కనిపించారు. ఈ ఒక్క పిక్ చాలు ఆ స్టార్స్ ఫ్యాన్స్ ఉత్సాహపరచడానికి.. కార్తికేయ, పూజా ప్రసాద్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో నాగార్జున, అఖిల్ కూడా పాల్గొన్నారు.

ఇక త్వరలోనే హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ కు ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. రిస్పెషన్ కూడా గ్రాండ్ గా ఉంటుందట.. టోటల్ టాలీవుడ్ సిని పరిశ్రమ మొత్తం కదిలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాడట. మరి రాజమౌళి ఏం చేసినా అది బిగ్ బడ్జెట్ మూవీనే కదా కాబట్టి ఆమాత్రం హంగామా ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news