ఆ ఇద్దరిలో బన్ని ఓటు ఎవరికి..?

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమా విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపించడం లేదు. నా పేరు సూర్య సినిమా అంచనాలను తప్పే సరికి బన్ని దర్శకుడి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అసలైతే బన్నితో విక్రం కుమార్ సినిమా ఓకే అయినట్టు అన్నారు. కాని అది ఎందుకో అటకెక్కేసిందని తెలుస్తుంది.

బన్ని తర్వాత సినిమా త్రివిక్రం తో ఉంటుందని అన్నారు కాని అరవింద సమేత తర్వాత ఎలా లేదన్నా త్రివిక్రం మరో ఆరు నెలలు టైం తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఈలోగా ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం బన్ని కోసం మారుతి, పరశురాం ఇద్దరు చెరో కథ రాసుకున్నారట. బన్ని ఓటు ఎవరికేస్తే వారితో సినిమా ఉంటుందని అంటున్నారు.

మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ.. కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను తీయడంలో పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. పరశురాం కూడా గీతా గోవిందం తో స్టార్ డైరక్టర్ అనిపించుకున్నాడు. ఈ ఇద్దరు బన్ని కోసం లైన్ సిద్ధం చేయగా ఎవరి కథ బన్ని ఓకే చేస్తాడో చూడాలి. ఇద్దరిలో బన్ని ఎవరితో సినిమా చేసినా కచ్చితంగా మంచి ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news