ఉదయ్ కిరణ్ తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎంత మంది అభిమానులను సొంతం చేసుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈయన నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ.. మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని.. ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఈయన చనిపోయి 8 యేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఈయనను మరిచిపోలేకపోతున్నారు. ఇకపోతే ఆయన మొదటి చిత్రానికి ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయం ఇటీవల బాగా వైరల్ గా మారింది. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారి పూర్తిగా చదివి తెలుసుకుందాం.

చిత్రం సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టిన ఉదయ్ కిరణ్ , ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇక ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా సరే సినీ ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీసిన ఉదయ్ కిరణ్ ను చూసి.. చిరంజీవి కూడా తన అల్లుడిని చేసుకోవాలని ముచ్చట పడ్డాడు. ఇక ఆ క్రమంలోనే తన కూతురునిచ్చి నిశ్చితార్థం కూడా జరిపించారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఇకపోతే కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే అవార్డు అందుకున్న నటుడు కూడా ఉదయ్ కిరణ్ కావడం గమనార్హం.Watch Chitram on ott streaming online

ఉదయ్ కిరణ్ తన మొదటి చిత్రం సినిమాకు గాను ఏకంగా 11 వేల రూపాయలను పారితోషికంగా తీసుకున్నారట. ఇక ఆ తర్వాత మనసంతా నువ్వే వంటి సినిమాలతో కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నీ స్నేహం, శ్రీరామ్, కలుసుకోవాలని వంటి సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ హీరో ను పెట్టీ రూ. 2 కోట్లతో సినిమాలు చేసి.. ఏకంగా రూ.20 కోట్లు వెనకేసుకున్న నిర్మాతలు కూడా ఉన్నారు .అందుకే అందరూ ఆయన్ని లక్కీ హ్యాండ్ అని పొగిడేవారు. ఇక కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2014 జనవరి 5వ తేదీన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news