మ‌హేష్ వ‌ద్ద‌కు మ‌రో లైన్‌తో వంశీ పైడిపల్లి.. వ‌ర్కోట్ అయ్యేనా..?

-

ఇటీవ‌ల వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొన్నేళ్లుగా టాప్ చైర్‌పై కన్నేసిన ఈ స్టార్ హీరో.. అందుకు అనుగుణంగానే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో ఈ ఏడాది అదిరిపోయేలా ఆరంభించాడు. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మూడు నెలలు బ్రేక్ తీసుకుని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాను చేస్తానని చెప్పాడు మహేష్. దీంతో మహేశ్ కోసం అతడు మాఫియా బ్యాగ్‌డ్రాప్ ఉన్న స్క్రిప్టును రెడీ చేశాడని ప్రచారం జరిగింది.

ఈ మూవీలో సూపర్ స్టార్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే వంశీ పైడిపల్లితో సినిమా కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మహేశ్ బాబుకు స్క్రిప్ట్ నచ్చకపోవడం వలన ఆలోచనను మార్చుకున్నాడు. అలా అని చెప్పి ఇప్పుడు వంశీ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కనపెట్టేయలేదు. వంశీ అంటే మహేష్ కు అపారమైన నమ్మకం. అందుకే వేరే కథతో రమ్మని వంశీకి చెప్పడం జరిగినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇక‌ మ‌రోవైపు.. మ‌హేష్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే వంశీ పైడిపల్లి మాత్రం జరిగినదానికి డీలా పడిపోకుండా, మరో లైన్ ను రెడీ చేసి, మహేశ్ బాబుకి వినిపించాడట. ఆయనకి లైన్ నచ్చేసి ఓకే అనడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. అయితే పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేయడమనేది ఇప్పట్లో అయ్యే పని కాదు గనుక, పరశురామ్ తరువాత సినిమాను తనతోనే మహేశ్ బాబు చేసేలా వంశీ పైడిపల్లి సెట్ చేసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news