నయా అవతార్​లో వెన్నెల కిశోర్.. హీరోగా స్పై యాక్షన్ మూవీ

-

టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్‌ తాజాగా నయా అవతార్​లో కనిపించారు. ఆయన హీరోగా తన తొలి చిత్రాన్ని ప్రకటించారు. స్పై యాక్షన్ కామెడీ చిత్రం చేస్తున్నట్లు తాజాగా తెలిపారు. ఈ చిత్రానికి చారీ 111 అనే టైటిల్​ను ఫిక్స్​ చేశారు. హీరో సుమంత్​తో కలిసి మళ్లీ మొదలైంది చిత్రం చేసిన దర్శకుడు టీజీ కీర్తి కుమార్​.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బార్కట్​ స్డూడియోస్​ బ్యానర్​పై అడితి సోని నిర్మిస్తుండగా.. సీనియర్ నటుడు మురళి శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్​ రవీంద్రన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ​ సీక్రెట్ స్పైగా కిశోర్​ నటిస్తుండగా.. మురళి శర్మ స్పై ఏజెన్సీ హెడ్​గా కనిపించనున్నారు. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్​గా నటిస్తోంది.

తాజాగా మేకర్స్​ సినిమాను అనౌన్స్ చేస్తూ ఓ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. వీడియోలో “ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ సిటీకి ఓ ప్రమాదం వచ్చి పడింది. దాన్ని ఎదురించడానికి ఒక ఎక్స్​ ఆర్మీ మెన్​ రా. ఈ కథలోనే ఒక విలన్​. ఒక హీరోయిన్​. అలాగే ఒక సమస్య. వీళంలతా ఎదురుచూసేది ఒకే ఒక్కడి కోసం. ఒక హీరో. కానీ వాళ్లకు దొరికిందేమో లక్క్ ఉండి టాలెంట్​ స్టైల్ ఉన్న స్టఫ్ లేని ఓ ట్యూబ్​లైట్​ గాడు.” అంటూ బ్యాక్​గ్రౌండ్​లో కమెడియన్ సత్య వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news