టాలీవుడ్ లో క్రేజీ కాంబో..దేవరకొండతో సమంత రొమాన్స్ !

-

ప్రస్తుతం టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో.. హీరోయిన్‌ సమంత.. అటు హీరో విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. లైగర్‌ అనే పాన్‌ ఇండియా మూవీతో విజయ్‌…ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. యశోద తో త్వరలోనే అందరినీ అలరించనుంది సమంత. లైగర్‌ మూవీ ఆగస్టు లో ప్రేక్షకుమ ముందుకు రానుంది.

ఈ సినిమా సెట్స్‌ పై శివ నిర్వాణ దర్శకత్వం లో ఓ సినిమా చేసేందుకు విజయ్‌ దేవర కొండ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దీనిని పాన్‌ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కించాలని నిర్నయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే నటీ, నటుల ఎంపిక చేస్తున్నారు.

కాగా.. ముందుగా ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ సరసన కియారా తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. అయితే.. ఈ నిర్ణయాన్ని చిత్ర బృందం వెనక్కి తీసుకుందట. వారి స్థానంలో కేవలం అగ్ర హీరోయిన్‌ సమంతనే ఫైనల్‌ చేసేశారట. ఈ మేరకు ఇప్పటికే సమంత కూడా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. దీంతో త్వరలోనే దీనిపై అఫిషియల్‌ ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news