కొత్త అవ‌తారం ఎత్తిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. సినిమా టిక్కెట్లు అమ్ముతూ..

-

టాలీవుడ్‌ యువ నటుడు విజయ్‌ దేవరకొండ కొత్త అవతారం ఎత్తాడు. పెళ్లి చూపులు చిత్రంతో విజయ్‌ కు సినీ లైఫ్‌ ఇచ్చిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ను `మీకు మాత్రమే చెప్తా` సినిమాలో హీరోగా పరిచయం చేశాడు. అయితే ఈ సినిమాతో నిర్మాతగా మారిన అతడు కౌంటర్‌లో కూర్చొని సినిమా టికెట్లు అమ్మాడు. తన సొంత నిర్మాణంలో తెరకెక్కించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా కోసం తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. శుక్రవారం సినిమా విడుదల నేపథ్యంలో ఐమ్యాక్స్ థియేటర్‌లో విజయ్ సందడి చేశాడు.

టికెట్ కౌంటర్‌లో కూర్చుని సినిమా టికెట్లు విక్రయించాడు. సినిమా చూద్దామని వచ్చిన ప్రేక్షకులు.. టికెట్ కౌంటర్‌లో విజయ్‌ని చూసి థ్రిల్ అయ్యారు. విజయ్ చేతుల మీదుగా టికెట్ తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, మీకు మాత్ర‌మే చెప్తా చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించింది. ఈ నేప‌థ్యంలో విజ‌య్‌కి నిర్మాత‌గా తొలి విజ‌యం ద‌క్క‌డంపై అభిమానులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news