బాహుబలి రైటర్ చేతుల్లో.. జయలలిత బయోపిక్ తళైవి..!

-

తమిళనాడు మాజి సిఎం జయలలిత బయోపిక్ గా తళైవి అనే సినిమా మొదలు పెడుతున్నారు. ఏ.ఎల్. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ భాషల్లోనే కాదు హింది సినిమాలకు కథలను అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ ఈమధ్యనే ఝాన్సీ రాణి లక్ష్మి భాయ్ సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు.

ఇక ఇప్పుడు జయలలిత బయోపిక్ గా వస్తున్న తళైవి సినిమాకు పర్యవేక్షకుడిగా ఉంటున్నాడు. ఏప్రిల్ లో మొదలు కానున్న ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది ఇంకా వెళ్లడించలేదు. జివి ప్రకాశ్ మ్యూజిక్ మాత్రం అందిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే జయలలిత జీవిత కథతో ది ఐరన్ లేడీ అని సినిమా మొదలైంది ఆ సినిమాను మిస్కిన్ డైరెక్ట్ చేస్తుండగా ఐరన్ లేడీ జయలలిత పాత్రలో నిత్యా మీనన్ నటిస్తుంది. ఈ రెండి బయోపిక్ లలో ఏ సినిమా అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news