విరాట్ కోహ్లీ నా క్రష్ : అనన్య పాండే

-

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సెలబ్రిటీ క్రష్ అని బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే అన్నారు. కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని ఆమె చెప్పుకొచ్చారు. ‘కాల్ మీ బే’ ప్రమోషన్లలో భాగంగా అనన్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కోహ్లీ గ్లోబల్ ఐకాన్. ఆయనలో ఏదో తెలియని శక్తి ఉంది. విరాట్లోని నాయకత్వ లక్షణాలు, జట్టును నడిపించిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’ అని అనన్య పేర్కొన్నారు.

కాగా, అనన్య పాండే తెలుగులో లైగర్ మూవీలో విజయదేవర కొండ సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీని దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించగా..బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఇక అప్పటినుంచి అనన్య తెలుగులో నేరుగా సినిమాలు చేయడం లేదు. బక్క పలుచని ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. కేవలం హిందీ సినిమాల మీదే తన ఫోకస్ పెట్టింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version