HCU విద్యార్ధులపై పోలీసుల లాఠీఛార్జ్ !

-

HCU విద్యార్ధులపై పోలీసుల లాఠీఛార్జ్ జరిగినదని సమాచారం అందుతోంది. HCU భూములు అమ్మకానికి పెట్టి, నిరసన తెలిపిన విద్యార్థులను గుంట నక్కలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు విద్యార్థులు. అయితే నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్లు సమాచారం అందుతోంది.

ఈ తరుణంలోనే గాయపడి, మూర్ఛపోయారు పలువురు విద్యార్థులు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన గచ్చిబౌలి సీఐ మరియు ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు విద్యార్థుల తరఫు న్యాయవాదులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version