మహేష్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య వార్…!

-

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి వారి సినిమాలకు కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇద్దరి హీరోల సినిమాలు ఒక్కసారే అంటే మాత్రం ఇక ఇద్దరు హీరోల అభిమానులకు పండగ వాతావరణమే ఉంటుంది. అటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమాల మీద కాస్త ఆసక్తి ఎక్కువే.

వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఇలాంటి సందడే నెలకొనబోతుంది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఆ సినిమాతో పాటుగా మహేష్ బాబు, వంశీ పైడపల్లి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

ఈ రెండు సినిమాలు ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారాయి. ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరికి ప్రేక్షకుల ముందుకి వస్తుంది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ముందు అనుకున్న విధంగానే వంశీ పైడపల్లి తో మహేష్ ముందుకి వెళ్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news