శర్వానంద్ కాబోయే భార్య రక్షిత రెడ్డి ఆస్తి విలువ ఎంతంటే..?

-

యంగ్ హీరో శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే ప్రస్తుతం పలు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈయన టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరిగా కూడా చలామని అవుతుంటారు.. కానీ త్వరలో వివాహ బంధం లోకి అడుగుపెట్టబోతున్నాడు. దాదాపు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈయన పెళ్లిపైనే చర్చలు నడుస్తున్నాయి. దాంతో ఈ విషయం ఇప్పుడు కొలిక్కి వచ్చిందని చెప్పాలి. శర్వా చేసుకోబోయే అమ్మాయి వివరాలు బయటకు వచ్చాయి. ఇకపోతే రక్షిత రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ఆయన వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

తెలంగాణ హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతేకాదు చిత్తూరు జిల్లాలకు చెందిన టిడిపి మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలు కూడా. బొజ్జల అల్లుడికి సొంత సోదరుడు మధుసూదన్ రెడ్డి. శర్వాకి కాబోయే మామా.. దీనిని బట్టి చూస్తే రక్షిత రెడ్డికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి కూడా కూడబెట్టిన ఆస్తులు సుమారుగా కోట్లల్లోనే ఉన్నాయని సమాచారం. తన తండ్రి ఆస్తితోపాటు తన తాతల తరపు నుంచి వస్తున్న ఆస్తులు కూడా రక్షిత పేరు మీదే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రక్షిత రెడ్డి కూడా బాగానే సంపాదించిందట.

మొత్తానికి వేల కోట్ల ఆస్తి ఉన్న రక్షిత రెడ్డి మెడలో శర్వానంద్ త్వరలో తాళికట్టబోతున్నాడు. అయితే శర్వానంద్ ది ప్రేమ వివాహ అని వార్తలు బాగా జోరుగా వినిపిస్తున్నాయి. మరికొంత మంది ఇది పెద్దలు కుదిరిచిన పెళ్లి అని చెబుతున్నారు. మొత్తానికి శర్వానంద్ ఇప్పుడు వివాహం చేసుకోబోతుండడంతో సెలబ్రిటీలే కాదు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news