తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి ఏ పార్టీ వైపో తెలుసా..?

-

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక ప్రకటన చేసింది. ఏపీ ఎన్నికలలో తన సపోర్ట్ ఏ పార్టీకో చెప్పింది. ఉగాదినాడు ఆమె ఎంపీ విజయసాయిరెడ్డి ఇంటికి పిల్లలతో పాటు వెళ్లి సరదాగా గడిపింది. దీనితో ఆమె వైసీపీకి సపోర్ట్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది చాలాసార్లు విజయ్ సాయి రెడ్డి తన తండ్రి లాంటి వాడు అని అలేఖ్య చెప్పింది. ఇంస్టాగ్రామ్ లో తాజాగా ఒక షాకింగ్ పోస్ట్ చేసింది.

రాబోయే ఎన్నికల్లో తన సపోర్ట్ బాలయ్య మామయ్యకి అని చెప్పింది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో బాలయ్య ఆయన తనయుడు మోక్షజ్ఞతో ఉన్న ఫోటోని షేర్ చేసి ఏ వైపు ఉన్నానని ఎప్పుడూ నాకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ సరైన నిర్ణయం ఇప్పుడు తీసుకున్నాను నా అంగీకారం ప్రేమ నా కుటుంబం మీదే అని రాసింది. ఆమె నిర్ణయం రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అలేఖ్య రెడ్డి సపోర్ట్ వైసీపీకి అనుకున్నాం కానీ అలేఖ్య రెడ్డి ఇవ్వలేదని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news