ట్రిపుల్ ఆర్ ఛాన్స్.. ఆలోచనే కిక్ ఇస్తుంది

-

ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాకు సంబందించి ఎలాంటి న్యూస్ అయినా వైరల్ అవడం ఖాయం. బాహుబలి తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ప్రతినాయకుడిగా కన్నడ ఎనర్జిటిక్ హీరో యశ్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. యశ్ నటించిన కే.జి.ఎఫ్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 21న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి అటెండ్ అవుతున్నాడని తెలుస్తుంది.

ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ లో విలన్ గా యశ్ ను ఒప్పించేందుకే రాజమౌళి కే.జి.ఎఫ్ ఈవెంట్ కు అటెండ్ అవుతున్నాడని అంటున్నారు. అయితే అటు ఇటు తిరిగి ఈ న్యూస్ యశ్ దాకా వెళ్లడంతో ట్రిపుల్ ఆర్ ఛాన్స్ రావాలే కాని తాను విలన్ గా చేసేందుకు సిద్ధమని అన్నాడు. అయితే ఇప్పటివరకు అలాంటి ఆఫర్ తనకు రాలేదని అన్నాడు. రాజమౌళి అండ్ టీం ఎవరు తనని సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చాడు యశ్.

ఇదిలాఉంటే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో విలన్ గా ఓ బాలీవుడ్ హీరోని సెలెక్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కీర్తి సురేష్, రష్మిక హీరోయిన్స్ గా ఫైనల్ అయినట్టు ఎక్స్ క్లూజివ్ న్యూస్.

Read more RELATED
Recommended to you

Latest news