అసెంబ్లీలో పెగాసెస్ ప్రస్తావన…మమతా కామెంట్లపై వైసీపీ సంచలన వ్యాఖ్యలు

-

అమరావతి : ఏపీ అసెంబ్లీలో పెగాసెస్ అంశంపై ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు పెగాసెస్ స్పై వేర్ ను వినియోగించారన్న మమతా కామెంట్లపై చర్చించాలని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేనిని కోరింది వైసీపీ. దీంతో పెగాసెస్ పై చర్చకు నోటీసివ్వాలని పేర్కొన్నారు స్పీకర్ తమ్మినేని.

ycp-tdp
ycp-tdp

ఇప్పటికే నోటీసిచ్చామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ప్రశ్నోత్తరాల అనంతరం పెగాసెస్ పై చర్చకు స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఫోన్లను అనధికారికంగా మానిటర్ చేస్తున్నారని.. చంద్రబాబు పెగాసెస్ స్పై వేర్ వాడారని మమతా బెనర్జీ స్పష్టం చేశారని నిప్పులు చెరిగారు.

టెలిగ్రాఫ్ యాక్టుకు సంబంధం లేకుండా పెగాసస్ ను వాడే అవకాశం ఉందన్నారు. ఇది వ్యక్తిగత హక్కులకు భంగం కలిగేలా ఉందని.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీకి చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలను రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు మంత్రి బుగ్గన.

Read more RELATED
Recommended to you

Latest news