కాశీ విశ్వేశ్వ‌రుడి ఆలయంలో ఇక నుంచీ డ్రెస్ కోడ్ తప్పనిసరి..

-

వారణాసిలోని విశ్వేశ్వ‌రుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ఇకపై డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. ఈ మేరకు కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయం తీసుకుంది. కాశీ విద్వత్ పరిషత్ తో సమావేశమైన అనంతరం ఆలయ పాలనా విభాగం నూతన నిబంధనలను ప్రకటించింది. గర్భగుడిలోని జ్యోతిర్లింగాన్ని స్పర్శించాలనుకునే భక్తులు సంప్రదాయక దుస్తులు ధరించాలని, పురుషులు ధోతీ-కుర్తా, స్త్రీలు చీర లాంటి ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఒకవేళ సంప్రదాయ దుస్తుల్లో రాని భక్తులను జ్యోతిర్లింగం స్పర్శదర్శనానికి అనుమతించమని, దూరం నుంచే దర్శించుకోవాలని పేర్కొంది. వారణాసి ఆలయంలో డ్రెస్ కోడ్ నిబంధనలు త్వరలోనే అమలు చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news