దేవాలయాల్లో ఇచ్చే తీర్థాల్లో రకాలు మీకు తెలుసా ?

-

దేవాలయంలోకి వెళితే తప్పక ప్రతీ భక్తుడు తీర్థం తీసుకుంటారు. స్వామి లేదా అమ్మవారి అనుగ్రహం కోసం తీర్థం తీసుకోవడం ఆచారంగా వస్తుంది. అయితే దీనివెనుక అనేక రహస్యాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం తీర్థం ఆయా దేవాలయాల్లో ఒక్కోరకంగా ఉంటుంది. దీనికి కారణం ఆ దేవాలయ సంప్రదాయం. ఈ తీర్థాలలో రకాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం…
జలతీర్ధం , పంచామృత తీర్ధం, పానకా తీర్ధం, కషాయ తీర్ధం.

జల తీర్ధం: ఈ తీర్ధం సేవించడం ద్వార అకాల మరణం, సర్వ రోగాలు నివారించ బడుతాయి. అన్నికష్టాలు తొలగి ఉపసమానాన్ని ఇస్తాయి. పంచామృత తీర్థం: పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం, బ్రహ్మలోకం ప్రాప్తి కలుగుతాయిని పండితుల ఉవాచ.

పానకా తీర్ధం: శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునిడికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నైవేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు. కారణం స్వామికి పానకాన్ని నైవేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు. అదేవిధంగా రామనవమి నాడు పానకాన్ని నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంచడం ఆచారంగా ఉంది.

పానకా తీర్ధాన్నిసేవిస్తే దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ది చురుకుగా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది . రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు. ఎముకలకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి.
ఇవేకాకుండా సుగుంధ తీర్థం, గంగాజల తీర్థం, నదీతీర్తం, తులసీ తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా రకరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు. వీటిని సేవించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది.
తీర్థం ఇచ్చేటప్పడు చదివే మంత్రంలోనే అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సకలపాపక్షయకరం అని చదువుతారు. కాబట్టి తప్పక దేవాలయంలో తీర్థం తీసుకోండి దేవతానుగ్రహం పొందండి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news